Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మైసూర్ : దక్షిణాఫ్రికా-ఏతో జరిగిన రెండో అనధికార టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఓవర్నైట్ స్కోర్ వికెట్లేమీ నష్టపోకుండా 14 పరుగులతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్-ఏ జట్టు శుక్రవారం 70 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 202 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్డ్ చేసింది. గుజరాత్ బ్యాట్స్మన్ ప్రియాంక్ పంచల్(109), కరణ్ నాయర్(51నాటౌట్) రాణించగా.. శుభ్మన్ గిల్(0) ఘోరంగా విఫలమయ్యాడు. తొలి వికెట్కు పంఛల్-అభిమన్యు జోడీ 94 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నిర్మించారు. ఆ తర్వాత మూడో వికెట్కు కరణ్ నాయర్ 92 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించాడు. దీంతో దక్షిణాఫ్రికా-ఏపై భారత్-ఏకు 219 పరుగుల ఆధిక్యత లభించినట్లైంది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా జట్టు 21 ఓవర్లలో కేవలం రెండు వికెట్లను మాత్రమే కోల్పోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.