Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఛటోగ్రామ్: ట్రయాంగులర్ టీ20 సిరీస్లో భాగంగా శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్లో జింబాబ్వే జట్టు 7 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ను చిత్తుచేసింది. కెరీర్లో ఆఖరి అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న జింబాబ్వే కెప్టెన్ మసకడ్జా(71) జింబాబ్వే గెలుపులో కీలకపాత్ర పోషించాడు. టాస్ గెల్చిన ఆఫ్గాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఓపెనర్, వికెట్కీపర్ గుర్బాజ్(61) కదం తొక్కగా... జజారు(31) ఫర్వాలేదనిపించాడు. మోఫూ(4/30), ముటొంబొడ్జి(2/18) అద్భుత బౌలింగ్ చేశారు. జింబాబ్వే 19.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 156 పరుగుల లక్ష్యాన్ని ఛేదించగల్గింది. అద్భుత ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ను గెలిపించిన మసకడ్జాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ మ్యాచ్ అనంతరం మసకడ్జా అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పాడు. శనివారం బంగ్లా-ఆఫ్గాన్ల మధ్య ఆఖరి లీగ్ మ్యాచ్ జరగనుండగా.. బంగ్లా-ఆఫ్గాన్ జట్లు రెండేసి విజయాలతో ఇప్పటికే ఫైనల్లోకి ప్రవేశించాయి. మంగళవారం ట్రయాంగులర్ టీ20 సిరీస్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.