Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైనా ఓపెన్లో ముగిసిన భారత్ పోరు
చాంగ్జౌ: చైనా ఓపెన్ బ్యాడ్మిం టన్ టోర్నీలో భారత షట్లర్ సాయి ప్రణీత్ పరాజయం పాలయ్యాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ కార్టర్ ఫైనల్లో పోరులో సాయి ప్రణీత్ 21-16, 6-21, 16-21 తేడాతో ఆంటోని సినిసుకా గింటిక్(ఇండోనేసియా) చేతిలో ఓడాడు. తొలి గేమ్ను గెలిచి మంచి ఊపు మీద కనిపించిన సాయి ప్రణీత్.. మిగతా రెండో గేమ్లో పూర్తిగా తేలిపోయాడు. ఓ దశలో ఆంటోని వరుస ఆరు పాయింట్లు సాధించడంతో భారీ ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. సాయికి గుక్క తిప్పుకోకుండా చేసి ఆ గేమ్ను 6-21తో గింటిక్ గెల్చుకున్నాడు. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్లో ఆంటోని ఆరంభంలోనే పైచేయి సాధించాడు. ప్రణీత్ను 2-6తో వెనక్కి నెట్టిన ఆంటోని.. అదే జోరును కడవరకూ కొనసాగించాడు. సాయి ప్రణీత్ కొంత పుంజుకోవడా నికి ప్రయత్నించినా ఆంటోని ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. వరుస పాయింట్లు సాధిస్తూ ప్రణీత్పై ఒత్తిడి పెంచాడు. దాంతో ప్రణీత్కు పరాజయం తప్పలేదు. సాయి ప్రణీత్ కూడా క్వార్టర్ఫైనల్లో పరాజయం చవిచూడడంతో చైనా ఓపెన్లో భారత్ పోరాటం ముగిసినట్లైంది. ఈ ఏడాది చైనా ఓపెన్లో కనీసం ఒక్క పతకం కూడా సాధించకుండానే భారత షట్లర్లు రిక్త హస్తాలతో వెనుదిరిగారు.