Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రజతంతో కొత్త చరిత్ర
- వరల్డ్ బాక్సింగ్ చాంపియన్షిప్స్
న్యూఢిల్లీ : భారత యువ బాక్సర్, భారత సైన్యంలో సుబేదార్ అమిత్ పంఘాల్ కొత్త చరిత్ర సృష్టించాడు. భారత బాక్సింగ్ చరిత్రలో మరే పురుష బాక్సర్కు సాధ్యపడని ప్రపంచ చాంపియన్షిప్స్ రజతాన్ని అమిత్ అందుకున్నాడు. సెమీఫైనల్లో అసమాన ప్రతిభతో తిరుగులేని విజయం సాధించిన అమిత్ పంఘాల్.. ఫైనల్లో అంచనాలను అందుకోలేదు. ఒలింపిక్ చాంపియన్ శాకోబ్దిన్ చేతిలో 0-5తో ఓటమిపాలయ్యాడు. ఫైనల్లో తొలి రౌండ్లో అమిత్ పంఘాల్ ఇబ్బంది పడ్డాడు. ప్రత్యర్థి వరుస పంచ్లు విసిరాడు. చివర్లో అమిత్ ప్రతిఘటించాడు. బలమైన పంచ్లతో విరుచుకుపడ్డాడు. రెండో రౌండ్లోనూ అమిత్ ఆరంభంలో ఆధిపత్యం సాధించలేదు. శాకోబ్దిన్ తెలివగా పంచ్లు విసిరాడు. అమిత్పై స్పష్టమైన ఆధిపత్యం చెలాయించాడు. రెండు రౌండ్ల సమరం పూర్తయిన తర్వాత ఐదుగురు న్యాయనిర్ణేతలు ఏకగ్రీవంగా శాకోబ్దిన్ను పసిడి విజేతగా ప్రకటించారు. అమిత్ పంఘాల్ రజతం సాధించాడు. మహిళల బాక్సింగ్లో మేరీకోమ్ రికార్డు స్థాయిలో ఆరు సార్లు వరల్డ్ చాంపియన్గా నిలిచినా.. మెన్స్ బాక్సింగ్ సర్క్యూట్లో ఇప్పటివరకూ ఎవ్వరూ వరల్డ్ చాంపియన్గా నిలువలేదు. ప్రపంచ చాంపియన్షిప్స్ ఫైనల్లో తలపడిన తొలి భారత బాక్సర్గా రికార్డు సాధించిన అమిత్ పంఘాల్, టోక్యో 2020 ఒలింపిక్స్ బెర్త్నూ సొంతం చేసుకున్నాడు. పురుషుల 52 కేజీల విభాగంలో అసమాన ప్రదర్శన చేసిన అమిత్ పంఘాల్, తుది పోరులో తడబడినా భారత్కు మెరుగైన పతకాన్ని అందించాడు.