Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంత్, అయ్యర్ నం.4పై కోహ్లి
బెంగళూర్ : బ్యాటింగ్ ఆర్డర్లో నం.4లో ఎవరు వెళ్లాలనే విషయంలో రిషబ్ పంత్, శ్రేయాష్ అయ్యర్ మధ్య సమాచార లోపంతో బెంగళూర్లో దక్షిణాఫ్రికాతో టీ20 మ్యాచ్లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఓపెనర్ శిఖర్ ధావన్ అవుట్ కాగానే డగౌట్ నుంచి రిషబ్ పంత్, శ్రేయాష్ అయ్యర్ ఇద్దరూ నం.4లో ఆడేందుకు సిద్ధమయ్యారు. ఏం జరుగుతుందో తెలియక కొంత గందరగోళ వాతవారణం ఏర్పడింది. ప్రెస్ కాన్ఫరెన్స్లో మీడియా నుంచి కోహ్లి ఈ ప్రశ్నే ఎదురైంది. ' పంత్, అయ్యర్లతో బ్యాటింగ్ కోచ్ మాట్లాడారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య సమన్వయ లోపం నెలకొంది. నిజానికి అదెంతో ఫన్నీగా అనిపించింది. ఇద్దరూ క్రీజువైపు వచ్చారు. ఏం జరుగుతుందో నాకూ అర్ధం కాలేదు. గేమ్ ప్లాన్ ప్రకారం పది ఓవర్ల లోపైతే నం.4లో శ్రేయాష్ అయ్యర్ రావాలి. పది ఓవర్ల తర్వాత నం.4లో రిషబ్ పంత్ రావాలని ' విరాట్ కోహ్లి అన్నాడు.
కోహ్లికి హెచ్చరిక : బెంగళూర్ టీ20లో సఫారీ సీమర్ హెండ్రిక్స్ను ఉద్దేశపూర్వకంగా భుజానికి ఢీకొట్టినందుకు కోహ్లికి ఐసీసీ అధికారిక హెచ్చరిక చేసింది. లెవల్ 1 తప్పిదం ప్రకారం ఓ డిమెరిట్ పాయింట్ విధించింది. కోహ్లికి ఇది మూడో తప్పిదం కాగా, అతడి ఖాతాలో మూడు డీ మెరిట్ పాయింట్లున్నాయి.