Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బరిలో సైనా, సింధు, ప్రణీత్
- కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్
ఇంచియాన్ (కొరియా) : మహిళల సింగిల్స్ వరల్డ్ చాంపియన్ పి.వి సింధు సీజన్లో తొలి బీడబ్ల్యూఎఫ్ టైటిల్ కోసం కొరియాకు చేరుకుంది. ఇటీవల వరల్డ్ చాంపియన్షిప్స్లో విజయంతో చరిత్ర సృష్టించిన పి.వి సింధు చైనా ఓపెన్ ప్రీ క్వార్టర్ఫైనల్లోనే పరాజయం పాలైంది. బిడబ్ల్యూఎఫ్ టైటిల్ కోసం సింధు మరోసారి రాకెట్కు పని చెప్పనుంది. ఈ ఏడాది ఇండోనేషియా ఓపెన్ ఫైనల్స్కు చేరినా టైటిల్ సింధుకు దక్కలేదు. ఇంచియాన్లో తొలి రౌండ్లో సింధుకు అమెరికా షట్లర్ బీవెన్ జాంగ్ ఎదురు కానుంది. చైనా ఓపెన్ ఓటమికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఇక్కడ రెండో రౌండ్లోనే సింధుకు దక్కనుంది. థారులాండ్ అమ్మాయి పొర్నపవీ చొచువాంగ్ ప్రీ క్వార్టర్స్లో సింధుతో తలపడే వీలుంది. వరుస గాయాలతో నిలకడగా రాణించటంలో విఫలమవుతున్న అగ్రశ్రేణి షట్లర్ సైనా నెహ్వాల్ తొలి రౌండ్లో కొరియా షట్లన్ కిమ్ గా ఎన్తో పోటీపడనుంది. ఈ సీజన్లో ఇండోనేషియా మాస్టర్స్ విజయం సాధించినా.. మలేషియా ఓపెన్, న్యూజిలాండ్ ఓపెన్, సుధీర్మన్ కప్, చైనా ఓపెన్లతో సైనా నిరాశపరిచింది. కిమ్తో సైనాకు 2-0తో మెరుగైన రికార్డుంది. పురుషుల సింగిల్స్లో బి. సాయిప్రణీత్, హెచ్.ఎస్ ప్రణరు, పారుపల్లి కశ్యప్ మెడల్ రేసులో ఉన్నారు. డబుల్స్ జోడీ సాత్విక్, చిరాగ్ తొలి రౌండ్లో నాల్గో సీడ్ జపాన్ జంటను ఎదుర్కొనున్నారు. మను అత్రి,సుమిత్ రెడ్డి జంట క్వాలిఫయర్స్తో తొలి రౌండ్ ఆడనున్నారు.