Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధోనిపై యువరాజ్ సింగ్
ముంబయి : భారత క్రికెట్ దిగ్గజం ఎం.ఎస్ ధోని క్రికెట్ కెరీర్ ముగింపుపై నిరంతర చర్చ సాగుతోంది. 2019 వరల్డ్కప్ సెమీఫైనల్స్ పరాజయం తర్వాత మహి వీడ్కోలుపై చర్చ ఊపందుకుంది. ధోని నుంచి ఎటువంటి మాట లేకుండానే, కెరీర్ ముగింపుపై తలోమాట చెబుతున్నారు. ధోనితో కలిసి భారత్కు గర్వించదగిన విజయాలు అందించిన యువరాజ్ సింగ్.. మహి వీడ్కోలు చర్చపై స్పందించాడు. ' ధోని వీడ్కోలుపై చర్చ సరైనది కాదు. భారత్కు అత్యంత విజయవంతమైన కెప్టెన్ ధోని. అతడికి కొంత సమయం ఇవ్వటం సమంజసం. ధోని దేశానికి ఎంతో చేశాడు. ఎప్పుడు వీడ్కోలు పలకాలనేది అతడికే వదిలేయటం గౌరవంగా ఉంటుంది' అని యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇంకా ఎదిగే దశలో ఉన్నాడు. అతడిని దిగ్గజ ధోనితో పోల్చటం పొరపాటు. ధోనిగా ఎదిగేందుకు ధోని ఎన్నో ఏండ్లు పట్టింది. ధోనికి చేరువగా వెళ్లేందుకు రిషబ్ పంత్కు ఎంతో సమయం పడుతుంది. పోలికలతో యువ ఆటగాడిపై ఒత్తిడి పెంచవద్దు. స్వేచ్ఛగా ఆడనివ్వండని యువీ అన్నాడు. 37 ఏండ్ల వయసులో యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.