Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ విడుదల
దుబాయ్ : అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్లో టీమిండియా కెప్టెన్ కోహ్లీ, శిఖర్ ధావన్లు స్థానాలు మెరుగుపరుచుకున్నారు. బుధవారం ఐసీసీ ప్రకటించిన జాబితాలో కోహ్లీ(11), ధావన్(13)వ స్థానంలో నిలిచారు. రోహిత్శర్మ, కెఎల్ రాహుల్ 8, 10 స్థానాల్లో కొనసాగుతున్నారు. బ్యాట్స్మన్ల జాబితాలో టాప్లో బాబర్ అజామ్(896 పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇటీవల భారత్-దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్లో జరిగిన ట్రయాంగులర్ టీ20 సిరీస్ ముగియడంతో ఐసీసీ ర్యాంకింగ్స్ను విడుదల చేసింది. అఫ్ఘాన్ బ్యాట్స్మన్ జజారు(727 పాయింట్లు) తొలిసారి ఐదోస్థానంలో నిలిచాడు. దీంతో అఫ్ఘన్ తరఫున అత్యుత్తమ ర్యాంక్ చేజిక్కించుకున్న ఆటగానిగా జజారు చరిత్ర సృష్టించాడు. బౌలర్ల జాబితాలో రషీద్ఖాన్(ఆఫ్ఘనిస్తాన్) 757 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా, ఆల్రౌండర్ల జాబితాలో గ్లెన్ మ్యాక్స్వెల్(ఆస్ట్రేలియా) 390 పాయింట్లతో టాప్లో కొనసాగుతున్నాడు.