Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీసీఐ వర్గాల సమాచారం
ముంబయి : భారత నం.1 సీమర్ జశ్ప్రీత్ బుమ్రా మైదానంలో బంతితో విజృంభించేందుకు మరింత ఎక్కువ సమయం పట్టనుందని భారత క్రికెట్ వర్గాలు అంటున్నాయ. స్ట్రెస్ ఫ్రాక్చర్తో బుమ్రా రానున్న ఫ్రీడమ్ సిరీస్కు దూరమయ్యాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్ ముగిసిన తర్వాత భారత్ స్వదేశంలో బంగ్లాదేశ్తో రెండు టెస్టులు ఆడనుంది. బంగ్లాదేశ్తో సిరీస్కు బుమ్రా రీ ఎంట్రీ ఇస్తాడనే తొలుత భావించారు. కానీ జట్టు మేనేజ్మెంట్ బుమ్రా వంద శాతం పూర్తి ఫిట్నెస్ సాధించిన తర్వాతే పునరాగమనం చేయాలని కోరుకుంటోంది. దీంతో స్వదేశంలో ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్స్లో బుమ్రా ఎటువంటి పాత్ర పోషించటం లేదు. ఆ తర్వాత వెస్టిండీస్తో సిరీస్, 2020 టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో టీమ్ ఇండియా ప్రణాళికలు పొట్టి ఫార్మాట్పైనే నెలకొన్నాయి. దీంతో ఈ సీజన్లో బుమ్రా స్వదేశీ టెస్టులు ఆడబోడని సమాచారం. డిసెంబర్లో వెస్టిండీస్ సిరీస్ సమయానికి బుమ్రా జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.