Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్
ఇంచియాన్ : భారత సీనియర్ షట్లర్, 33 ఏండ్ల వెటరన్ క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్ ఈ సీజన్లో మరోసారి సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. గ్లాస్కో కామన్వెల్త్ చాంపియన్ శుక్రవారం జరిగిన క్వార్టర్ఫైనల్స్ పోరులో మాజీ వరల్డ్ నం.2 జాన్ జొర్గెన్సన్పై అలవోక విజయం సాధించాడు. 37 నిమిషాల క్వార్టర్స్ సమరంలో 24-22, 21-8తో పారుపల్లి ఫటాఫట్ విజయాన్ని సాధించాడు. డెన్మార్క్ షట్లర్తో చివరగా ఐదేండ్ల కిందట ముఖాముఖి తలపడిన పారుపల్లి కశ్యప్ ఇంచియాన్లో ఇరగదీశాడు. తొలి గేమ్లో ఆధిపత్యం కోసం పోరాడాల్సి వచ్చినా.. రెండో గేమ్లో తిరుగులేని విజయం సాధించాడు. రెండో గేమ్లో షటిల్ను ఖాళీల్లోకి పంపించిన కశ్యప్, తెలివిగా పాయింట్లు రాబట్టాడు. ఏకపక్షంగా రెండో గేమ్ నెగ్గి సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. నేడు ఫైనల్స్ బెర్త్ కోసం జపాన్ స్టార్ షట్లర్ కెంటో మోమోటతో కశ్యప్ తాడోపేడో తేల్చుకోనున్నాడు.