Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సందీప్ ఐదు వికెట్ల ప్రదర్శన
ఆలూరు (కర్నాటక) : దేశవాళీ విజరు హజారే వన్డే టోర్నీలో హైదరాబాద్ బోణీ కొట్టింది. వర్షం కారణంతో కర్నాటక, గోవాలతో మ్యాచ్లు రద్దు కాగా.. శనివారం ఆలూరు గ్రౌండ్లో సౌరాష్ట్రతో హైదరాబాద్ తలపడింది. లెఫ్టార్మ్ స్పిన్నర్ బి.పి సందీప్ (5/26) మెరుపులతో హైదరాబాద్ 121 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మహ్మద్ సిరాజ్ (2/20), సివి మిలింద్ (2/41), సందీప్ (5/26) త్రయం వికెట్ల వేటలో జోరందుకోగా.. ఛేదనలో సౌరాష్ట్ర 39.1 ఓవర్లలో 131 పరుగులకే కుప్పకూలింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 252/5 పరుగులు చేసింది. కెప్టెన్ అంబటి రాయుడు (17) నిరాశపరిచాడు. ఓపెనర్ తన్మరు అగర్వాల్ (79), తిలక్ వర్మ (65) అర్ధ సెంచరీలో సాధించగా.. సందీప్ (38), రోహిత్ రాయుడు (20), సివి మిలింద్ (20) రాణించారు. గ్రూప్-ఏలో హైదరాబాద్కు ఇదే తొలి విజయం. వర్షం కారణంగా రద్దైన తొలి రెండు మ్యాచులను బీసీసీఐ మళ్లీ నిర్వహించనుంది. త్వరలోనే షెడ్యూల్ విడుదల చేయనుంది.