Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్, దక్షిణాఫ్రికా మహిళల సిరీస్
సూరత్ : వరుణుడు రాకతో మరో క్రికెట్ మ్యాచ్ రద్దు అయ్యింది. మహిళల క్రికెట్ మ్యాచ్కు తొలిసారి భారీ సంఖ్యలో అభిమానులు తరలి వచ్చిన ఆనందం బీసీసీఐకి లేకుండా చేస్తోంది వర్షం. తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన అలవోక విజయం సాధించి సిరీస్లో 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. రెండో టీ20, తాజా మూడో మ్యాచ్ సైతం బంతి పడకుండానే రద్దయ్యాయి. సిరీస్లో నాల్గో టీ20 అక్టోబర్ 1న మంగళవారం జరుగుతుంది. మూడో టీ20 మ్యాచ్కు సుమారు 10000 మంది అభిమానులు స్టేడియానికి వచ్చారు. కుండపోత వర్షంతో మైదానం పూర్తిగా కుంటను తలపించింది. టాస్ కూడా పడకుండానే వరుసగా రెండో మ్యాచ్ వర్షార్పణమైంది. మహిళల క్రికెట్ మ్యాచ్కు స్టేడియం ప్రవేశం ఉచితం. అయినా, నిలకడగా మ్యాచులు రద్దు అయితే అభిమానులు మైదానానికి వచ్చేందుకు పునరాలోచన చేసే ప్రమాదం ఉంది!.