Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్యాడ్మింటన్ జాతీయ కోచ్ గోపీచంద్
నవతెలంగాణ, హైదరాబాద్ : ప్రజలందరూ క్రీడా స్ఫూర్తితో మెలిగినప్పుడే దేశం ముందడుగు వేయగలదని బ్యాడ్మింటన్ జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అభిప్రాయపడ్డారు. ' క్రీడల ద్వారానే మానసిక దృడత్వం, సంపూర్ణ ఆరోగ్యం సాధిస్తాం. చిన్నారులు క్రీడల పట్ల ఆసక్తి కనబరిచేలా తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలి. క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగితేనే దేశం ముందడుగు వేయగలదు. క్రీడా రంగంలో రాణించాలంటే పట్టుదల ఎంతో అవసరం' అని గోపీచంద్ అన్నారు. గచ్చీబౌలిలోని శరత్కమల్ క్యాపిటల్ మాల్లో క్రీడా ఉపకరణాల సంస్థ యోనెక్స్ బ్రాండ్ అవుట్ లెట్ను సోమవారం గోపీచంద్ ప్రారంభించారు. షోరూంలో నూతన క్రీడా సామాగ్రిని గోపీచంద్ పరిశీలించారు. కార్యక్రమంలో బ్యాడ్మింటన్ క్రీడాకారులు హెచ్.ఎస్ ప్రణరు, సమీర్ వర్మలు పాల్గొన్నారు