Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రీడా మంత్రి కిరణ్ రిజ్జు
న్యూఢిల్లీ : 2022 బర్మింగ్హామ్ కామన్వెల్త్ క్రీడల ప్రాతినిథ్యం విషయంలో భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ), భారత రైఫిల్ షూటింగ్ సంఘం (ఎన్ఆర్ఏఐ)లకు పూర్తి మద్దతు ఇస్తామని క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజ్జు పేర్కొన్నారు. ' క్రీడా శాఖ పూర్తిగా షూటింగ్ సంఘం, ఒలింపిక్ సంఘం వెన్నంటి ఉంటుంది. భావోద్వేగాలను పూర్తిగా అర్థం చేసుకుంటాం. భారత్ భావోద్వేగాలను కామన్వెల్త్ క్రీడల ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రతి నిర్ణయం దేశం, క్రీడాకారుల అభ్యున్నతి కోసమే తీసుకుంటాం. అన్ని అంశాలను పరిశీలించి, సరైన నిర్ణయం తీసుకుంటాం' అని కిరణ్ రిజ్జు పేర్కొన్నారు. కామన్వెల్త్ క్రీడల్లో భారత్ దండిగా పతకాలు సాధించే షూటింగ్ను బర్మింగ్హామ్ క్రీడల జాబితా నుంచి తొలగించారు. గత రెండు దశాబ్దాలలో కామన్వెల్త్ గేమ్స్కు ఆతిథ్యం ఇచ్చిన ఏకైక దేశం భారత్. అయినా, భారత ప్రాధమ్యాలను పట్టించుకోవటం లేదు. కామనెవెల్త్ క్రీడల బహిష్కరణపై భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) సానుకూలంగా కనిపిస్తోంది. ఈ విషయంలో భిన్న స్వరాలు వినిపిస్తున్నా.. ఒలింపిక్ సంఘం తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇస్తామని క్రీడా మంత్రి తెలిపారు.