Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికల్లో పాల్గొనేందుకు నిరాకరణ
ముంబయి : భారత క్రికెట్లో ఇప్పుడు అత్యంత వివాదస్పద నిబంధన పరస్పర విరుద్ధ ప్రయోజనాలు. భారత దిగ్గజ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ సహా కపిల్ దేవ్లకు ఇప్పటికే విరుద్ధ ప్రయోజనాల విషయంలో షాక్ తగిలింది. తాజాగా ఈ జాబితాలోకి మాజీ క్రికెటర్, మాజీ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ చేరిపోయాడు. అక్టోబర్ 4న జరుగనున్న ముంబయి క్రికెట్ సంఘం (ఎంసీఏ) ఎన్నికల్లో అధ్యక్ష పదవికి సందీప్ పాటిల్ పోటీ చేయాలనుకున్నాడు. ఇదే సమయంలో బీసీసీఐ అధికారిక ప్రసారదారు స్టార్స్పోర్ట్స్తో సందీప్ పాటిల్ మరాఠీ వ్యాఖ్యాతగా ఒప్పందం కుదుర్చుకున్నాడు. వ్యాఖ్యాతగా ఉంటూ, ఎన్నికల్లో పోటీ చేయటం పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తుందని బోర్డు సీఈవో రాహుల్ జోహ్రీ సూచించారు. దీంతో ఎంసీఏ ఎన్నికల అధికారి డిఎన్. చౌదరినీ సందీప్ సంప్రదించాడు. నూతన రాజ్యాంగం ప్రకారం వ్యాఖ్యాతగా కొనసాగుతూ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులని ఎన్నికల అధికారి తేల్చారు. ' స్టార్స్పోర్ట్స్తో ఒప్పందం రద్దు చేసుకోనని చెప్పాను. వ్యాఖ్యాతగా వచ్చే సొమ్ముతోనే జీవనం సాగుతుంది. ముంబయి క్రికెట్కు సేవ చేయాలని భావించాను. ఇది ఎంతో బాధగా ఉంది' అని సందీప్ పాటిల్ వాపోయాడు.