Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాక్ సీమర్ మహ్మద్ ఇర్ఫాన్
కరాచీ : 2012 భారత్, పాకిస్థాన్ ద్వైపాక్షిక సిరీస్లో గౌతం గంభీర్ను ఏకంగా నాలుగు సార్లు అవుట్ చేసి, అతడి కెరీర్ ముగింపు నేనే పలికానని పాక్ సీమర్ మహ్మద్ ఇర్ఫాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2012 వన్డే, టీ20 సిరీస్లో గంభీర్ను ఇర్ఫాన్ నాలుగు సార్లు అవుట్ చేశాడు. ఆ తర్వాత గంభీర్ ఇంగ్లాండ్తో సిరీస్ మాత్రమే ఆడాడు. పేలవ ఫామ్తో జాతీయ జట్టుకు దూరమయ్యాడు. ' భారత్తో ఆడినప్పుడు బ్యాట్స్మెన్ నన్ను ఎదుర్కొనేందుకు సౌకర్యవంతంగా భావించలేదు. నా ఎత్తుతో స్పీడ్, పేస్ను సరిగా అంచనా వేయలేకపోయామని కొందరు నాతో చెప్పారు. నెట్ సెషన్లలోనూ గంభీర్ నన్ను చూసేందుకు ఇష్టపడేవాడు. నాలుగు సార్లు అవుట్ చేయటంతో నాపై ఆడేందుకు ఆత్మవిశ్వాసం కోల్పోయాడు' అని ఇర్ఫాన్ అన్నాడు. ' విరాట్ కోహ్లి నా పేస్ అంచనా వేయలేదు. 130-135 వేగంతో వేస్తానని అంచనా వేసినప్పుడు.. నేను 140-145 వేగంతో విసిరాను. నా బంతి ఆడేందుకు విరాట్ ఇబ్బంది పడ్డాడు. నాపై పుల్ షాట్ ఆడవద్దని యువరాజ్ సింగ్ పంజాబీలో కోహ్లికి చెప్పాడు. కానీ కోహ్లి పుల్ షాట్ ఆడి క్యాచౌట్ అయ్యాడు. ఆడావుగా.. ఇక వెనక్కి వెళ్లు అన్నాడు' అని ఇర్ఫాన్ అన్నాడు. ఇర్ఫాన్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భారత అభిమానులు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.