Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బడ్డి: నాల్గవ ఎలైట్ జాతీయ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పురుషుల విభాగం ఫైనల్లోకి శివ థాపా, సచిన్ శివ ప్రవేశించారు. బుధవారం జరిగిన సెమీఫైనల్ పోటీల్లో సచిన్ 57 కిలోల విభాగంలో, శివ థాపా 63 కిలోల విభాగంలో ప్రత్యర్థులపై గెలిచారు. 20మంది బాక్సర్లు పాల్గొన్న ఈ పోటీల్లో ఎనిమిదిమంది బాక్సర్లు సర్వీసెస్ తరఫున, ఐదుగురు బాక్సర్లు రైల్వేస్ తరఫున ఫైనల్లోకి ప్రవేశించడం గమనార్హం. రైల్వేస్కు చెందిన సచిన్ సెమీస్ పంజాబ్కు చెందిన సాగర్ చంద్పై 5-0 పాయింట్లతో గెలిచాడు. గురువారం జరిగే ఫైనల్లో కామన్వెల్త్ గేమ్స్ కాంస్య పతక విజేత హుసాముద్దీన్తో తలపడతాడు. సెమీఫైనల్లో మహ్మద్ హుసాముద్దీన్ 5-0తో రోషన్ సైన్(రాజస్తాన్)ను చిత్తుచేశాడు. మరో మ్యాచ్లో శివ గత ఏడాది రజిత పతక విజేత అభిషేక్ యాదవ్పై విజయాన్ని నమోదు చేసుకున్నాడు. ఫైనల్లో గత ఏడాది స్వర్ణ పతక విజేత, సర్వీసెస్కు చెందిన అంకుశ్ దహియాతో తలపడతాడు.