Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి
- బంగ్లాదేశ్ సిరీస్కూ దూరం
భవిష్యత్ ప్రణాళికపై ఏ నిర్ణయమైనా మహేంద్రసింగ్ ధోనిపైనే ఆధారపడి ఉందని టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నాడు. వెస్టిండీస్, దక్షిణాఫ్రికా సిరీస్లకు అందుబాటులో లేని ధోని రానున్న బంగ్లాదేశ్ సిరీస్కు కూడా దూరంగా ఉండాలని బుధవారం నిశ్చయించుకున్నాడు. కాగా, మాజీ కెప్టెన్ తిరిగి ఎప్పుడు ఆడాలనుకుంటున్నాడనే విషయమై అతనే నిర్ణయం తీసుకోవాలని, అలాగే భవిష్యత్తు ప్రణాళికపైనా సెలక్టర్లకు సమాచారం అందిస్తే బాగుంటుందని రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. అలాగే ధోని రిటైర్మంట్పై వస్తున్న ఉహాగానాలపై శాస్త్రి మాట్లాడుతూ తాను ప్రపంచకప్ తర్వాత ధోనిని కలవలేదన్నాడు. ఇక టెస్టుల్లో రిషబ్పంత్ను కాదని వృద్దిమాన్ సాహాను ఎంపిక చేయడం వెనుక కారణాన్ని శాస్త్రి వివరించాడు. గత ఏడాది జనవరిలో బెంగాల్ వికెట్కీపర్ గాయపడడం వల్లే పంత్కు అవకాశమొచ్చిందని పేర్కొన్నాడు. సాహా టెస్టుల్లో ఇప్పటికే మంచి నైపుణ్యం కలిగిన బ్యాట్స్మెన్గా గుర్తింపు సాధించాడని, అలాగని పంత్ను తక్కువ చేసి చూడట్లేదని తెలిపాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలతో జరిగిన టెస్టు సిరీస్ల్లో సెంచరీలతో ఆకట్టుకున్న పంత్ ఇంకా యువకుడే కావడంతో అతనికి భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు వస్తాయని శాస్త్రి చెప్పుకొచ్చాడు.