Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మొనాకో: భారత మహిళా స్ప్రింటర్ నిర్మల షరోన్పై అథ్లెటిక్స్ ఇంటెగ్రిటీ యూనిట్(ఎఐయు) నాలుగేండ్ల నిషేధం విధించింది. జూన్ 2018లో ఆమెనుంచి సేకరించిన రక్త, యూరిన్ నమూనాలు పరీక్షించగా నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు ఋజువు కావడంతో ఆమెపై ఎఐయు బుధవారం వేటు వేసింది. నిర్మల 2017 ఆసియా క్రీడల సందర్భంగా నిషేధిత స్టెరాయిడ్స్ డ్రోస్టావోలోన్ మరియు మెటెనోలోన్లు వాడినట్లు రుజువైంది. దీంతో ఆ క్రీడల్లో ఆమె గెల్చుకున్న రెండు పతకాలను కోల్పోనుంది. నిర్మల ఆసియా క్రీడల్లో మహిళల 400మీ. మరియు 4ఞ400మీటర్ల రిలేలో స్వర్ణ పతకాలను గెల్చుకుంది. నిర్మల ఇంతకుముందు 2016 రియో ఒలింపిక్స్లోనూ పాల్గొని హీట్స్లోనే వెనుదిరిగింది. నిర్మలపై నిషేధం ఆగస్టు 2016నుండి నాలుగేండ్లపాటు కొనసాగనుంది.