Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అక్టోబర్ 23 ఎన్నికలు, వార్షిక సర్వ సభ్య సమావేశానికి ప్రస్తుత ఆఫీస్ బేరర్లకు ఆహ్వానం అందలేదు. బీసీసీఐ ఎస్జీఎంకు అధ్యక్షుడు అధ్యక్షత వహిస్తారు, నూతన ఆఫీస్ బేరర్లకు బాధ్యతలు బదలాయిస్తారు. కానీ తాత్కాలిక అధ్యక్షుడు సి.కె ఖన్నా, కార్యదర్శి అమితాబ్ చౌదరి, కోశాధికారి అనిరుధ్ చౌదరిలకు ఎస్జీం ఆహ్వానం అందలేదు. ఆర్థిక లావాదేవీలు సహా ఇతర దస్త్రాలపై సంతకాలు చేసిన ఆఫీస్ బేరర్లు.. ఎస్జీఎం ఆహ్వానం ఆశించినా పాలకుల కమిటీ (సీఓఏ) ఆ ఆలోచన చేయలేదు. ఇదిలా ఉండగా బీసీసీఐ కీలక సభ్య సంఘాలు తమిళనాడు క్రికెట్ సంఘం, హర్యానా క్రికెట్ సంఘం, మహరాష్ట్ర క్రికెట్ సంఘం బోర్డు ఎన్నికల్లో పాల్గొనే హక్కు కోల్పోయారని పాలకుల కమిటీ గురువారం నోటీసు ఇచ్చింది. జస్టిస్ లోధా కమిటీ సిఫారసులను ఈ మూడు సంఘాలు పాటించలేదు. మహారాష్ట్ర కనీసం రాజ్యాంగం నమోదు చేసుకోలేదు, తమిళనాడులో మాజీ క్రికెటర్లకు చోటు కల్పించలేదు. పాలకుల కమిటీ ముందుగా నోటీసు ఇచ్చినా.. రాష్ట్ర సంఘాలు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని సీఓఏ చీఫ్ వినోద్రారు తెలిపారు. ఈ మూడు సంఘాలు ఎస్జీఎంలో పాల్గొనే హక్కు, ఓటు హక్కు కోల్పోయాయి. బీసీసీఐ పరిపాలనలో భాగమయ్యే అవకాశం కోల్పోయాయని రారు అన్నారు. ఈ లేఖను ఎన్నికల అధికారి ఎన్. గోపాలస్వామి, కోర్టు అమికస్ క్యూరి నరసింహలకు సైతం సీఓఏ పంపించింది. ఈ నిర్ణయానికి రారు, రవీంద్ర అనుకూలత వ్యక్తం చేయగా.. డయాన ఎదుల్జీ అభ్యంతరం తెలిపింది. పాలకుల కమిటీ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని తమిళనాడు క్రికెట్ సంఘం (టీఎన్సీఏ) కార్యదర్శి రామస్వామి అన్నారు.