Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 21 ఫోర్లు, 10 సిక్సర్లతో 212
ఆలూరు (కర్నాటక) : కేరళ యువ బ్యాట్స్మన్ సంజూ శాంసన్ (212 నాటౌట్, 129 బంతుల్లో 21 ఫోర్లు, 10 సిక్స్లు) దేశవాళీ క్రికెట్లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. విజరు హజారే (50 ఓవర్లు) ట్రోఫీలో గ్రూప్-ఏ మ్యాచ్లో గోవాపై సంజూ శాంసన్ శివమెత్తాడు. భారత దేశవాళీ లిస్ట్-ఏ మ్యాచ్లో అత్యధిక స్కోరు రికార్డు సొంతం చేసుకున్నాడు. ఉత్తరాఖండ్ బ్యాట్స్మన్ కర్ణ్ కౌశల్ (202) రికార్డును సంజూ తిరగరాశాడు. కెప్టెన్ సచిన్ బేబీ (127, 135 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్లు)తో కలిసి మూడో వికెట్కు 338 పరుగులు జోడించిన సంజూ శాంసన్ గోవా బౌలర్లపై విరుచుకు పడ్డాడు. 21 ఫోర్లు, పది సిక్సర్లతో చెలరేగాడు. సంజూ మెరుపులతో కేరళ 377/3 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేదనలో గోవా 273/8 పరుగులే చేయగా కేరళ 104 పరుగుల తేడాతో గెలుపొందింది.