Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పసిడి ముంగిట యువ బాక్సర్
- మేరీకోమ్, లవ్లినా, జమునలకు కాంస్యాలు
- ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్స్
ఉలాన్ ఉదె (రష్యా) : యువ బాక్సర్ మంజు రాణి ప్రపంచ చాంపియన్షిప్స్లో చరిత్ర సృష్టించింది. 18 ఏండ్లలో వరల్డ్ బాక్సింగ్ చాంపియన్షిప్స్ అరంగ్రేటంలోనే ఫైనల్లోకి ప్రవేశించిన తొలి బాక్సర్గా మంజు రికార్డు నెలకొల్పింది. రష్యాలోని ఉలాన్ ఉదెలో జరుగుతున్న మహిళల ఏఐబిఏ ప్రపంచ చాంపియన్షిప్స్ 48 కేజీల మహిళల విభాగంలో మంజు రాణి ఫైనల్లోకి చేరుకుంది. క్వార్టర్ఫైనల్లో వరల్డ్ నం.1 కొరియా బాక్సర్న మట్టికరిపించిన మంజు రాణి.. సెమీస్లో థారులాండ్ బాక్సర్ను చిత్తు చేసింది. 4-1తో స్పష్టమైన విజయం సాధించింది. సెమీస్లో తలపడిన దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ కాంస్యంతో సరిపెట్టుకుంది. లవ్లినా, జమునలు సైతం సెమీఫైనల్లో పోరాడి ఓడారు. కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు.
సెమీఫైనల్స్లో మంజు రాణి తొలుత బరిలోకి దిగింది. థారులాండ్ బాక్సర్ చుటమత్ రక్సత్పై అలవోక విజయం సాధించింది. తొలి రౌండ్లో బాక్సర్లు ఇద్దరు ఒకరిపై ఒకరు వేగంగా పంచ్లు విసురుకున్నారు. మంజు పదునైన పంచ్లతో తొలి రైండ్లో పైచేయి సాధించింది. రెండో రౌండ్లో రక్సత్ ఎదురుదాడి చేసింది. మంజు బాడీ లక్ష్యంగా వరుస పంచ్లు సంధించింది. డిఫెన్స్లో మెప్పించిన మంజు ఎటాకింగ్ చేసి కీలక పాయింట్లు సాధించింది. ఐదుగురు న్యాయ నిర్ణేతలు మంజు రాణిని 4-1తో విజేతగా ప్రకటించారు. 2001లో మేరీకోమ్ అరంగ్రేటంలోనే వరల్డ్ చాంపియన్షిప్స్ ఫైనల్లోకి ప్రవేశించింది. మేరీ తర్వాత ఆ ఘనత సాధించిన తొలి బాక్సర్ మంజు రాణి. 54 కేజీల విభాగంలో జమున 0-5తో చైనీస్ తైపీ బాక్సర్ చేతిలో ఓటమిపాలైంది. 69 కేజీల విభాగం సెమీస్లో లవ్లినా గట్టి పోటీ ఇచ్చింది. చైనా బాక్సర్కు తృటిలో 2-3తో ఫైనల్స్ బెర్త్ను కోల్పోయింది. 51 కేజీల విభాగంలో మేరీకోమ్ టర్కీ బాక్సర్ చేతిలో ఓటమిపాలైంది. మేరీకోమ్, జమున, లవ్లినాలకు కాంస్య పతకాలు లభించాయి. పసిడి కోసం మంజు రాణి నేడు మరోసారి పంచ్ విసరనుంది.