Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉలాన్ ఉదె (రష్యా) : ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్ మంజు రాణి రజత పతకంతో సరిపెట్టుకుంది. ఈ టోర్నిలో 48 కేజీల విభాగంలో ఆదివారం జరిగిన ఫైనల్లో మంజు రాణిపై రష్యాకు చెందిన బాక్సింగ్ క్రీడాకారిణి ఎకతెరిన పాల్సివ 4-1తో ఘన విజయం సాధించింది. దీంతో మంజు రాణి రజతంతో సరిపెట్టు కుంది. ఈ టోర్ని సెమీస్లో శనివారం థారులాండ్ బాక్సర్ చతామత్ రక్సాత్పై 4-1 స్కోరుతో విజయంతో మంజు రాణి ఫైనల్స్కు చేరుకున్న విషయం తెలిసిందే. శనివారంతోనే ఆమె 20వ సంవత్సరంలోకి ప్రవేశించింది. హర్యానకు చెందిన మంజు రాణి ఈ టోర్నిలో 6వ సీడెడ్గా బరిలోకి దిగింది. ఈ టోర్నిలో భారత్ నుంచి ఫైనల్కు మంజు రాణి మాత్రమే చేరుకోవడంతో ఆమెపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ ప్రస్తుత ఛాంపియన్షిప్లో భారత్ నుంచి మేరీ కోమ్ (51 కేజీలు), జమునా బోరో (54 కేజీలు), లోవిలోనా బోర్గాహైన్ (69 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు.