Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోల్కతా: ప్రపంచకప్ క్వాలిఫయర్స్ గ్రూప్-2లో భారత జట్టు బంగ్లాదేశ్తో ఫుట్బాల్ మ్యాచ్ను డ్రాగా ముగించింది. మంగళవారం జరిగిన ఈ పోటీలో నిర్ణీత సమయానికి ఇరుజట్లు 1-1 గోల్స్తో సమంగా నిలిచాయి. తొలి అర్ధభాగం 42వ నిమిషంలో బంగ్లాదేశ్ తరఫున సాద్వుద్దీన్ గోల్ చేసి 1-0 ఆధిక్యతను సంపాదించిపెట్టాడు. ఆ ఆధిక్యతనే కొనసాగిస్తూ మ్యాచ్ చివరి నిమిషాలవరకూ భారత్కు గోల్ కాకుండా బంగ్లాదేశ్ ఆటగాళ్లు అడ్డుకోగలిగారు. కానీ 88వ నిమిషంలో భారత్ తరఫున ఆదిల్ఖాన్ గోల్ చేయడంలో భారత శిబిరంలో ఆనందోత్సవాలు వెల్లివిరిసాయి. ఆ తర్వాత ఇరుజట్లు గోల్ చేయలేకపోయాయి.