Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గుజరాత్: మూడు నెలలకు పైగా ఉత్కంఠభరితంగా సాగిన ప్రొ కబడ్డీ పోటీలు చివరి దశకు చేరుకున్నాయి. బుధవారం జరిగే తొలి సెమీఫైనల్ పోటీలో దబాంగ్ ఢిల్లీతో బెంగళూరు బుల్స్, రెండో సెమీఫైనల్ పోటీలో బెంగాల్ వారియర్స్తో యు ముంబ జట్టు తలపడనుంది. టైటిల్ పోరు శనివారం సెమీస్ విజేతల మధ్య జరగనుంది. లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన దబాంగ్ ఢిల్లీ, రెండోస్థానంలో నిలిచి బెంగాల్ వారియర్స్ జట్లు నేరుగా సెమీస్కు అర్హత సాధించగా... సోమవారం జరిగిన ప్లే-ఆఫ్ మ్యాచ్లో యు ముంబ, బెంగళూరు బుల్స్ విజయాలను నమోదు చేసుకొని సెమీస్ బెర్త్ ఖాయం చేసుకున్నాయి.
సెమీఫైనల్స్
దబాంగ్ ఢిల్లీ × బెంగళూరు బుల్స్
బెంగాల్ వారియర్స్ × యు ముంబ