Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: బిసిసిఐ అధ్యక్ష పదవికి గంగూలీ నామినేషన్ వేయడం తనకు సంతోషంగా ఉందని సుప్రీంకోర్టు నియమించిన పాలకుల కమిటీ చీఫ్ వినోద్ రాయ్ అన్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న వినోద్ రాయ్ దాదా నామినేషన్ వేశాడని తెలిసి మీడియాతో మాట్లాడారు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ పాలకునిగా, టీమిండియా అత్యుత్తమ కెప్టెన్గా పనిచేసిన గంగూలీ బిసిసిఐ అధ్యక్షుడిగా నియామకం అయితే అది గొప్ప విషయమని పేర్కొన్నారు. ఇది తనకు ఎంతో సంతోషంగా కూడా ఉందని చెప్పారు. ఐసిసి మాజీ ఛైర్మన్ ఎన్ శ్రీనివాసన్, ఐపిఎల్ మాజీ ఛైర్మన్ రాజీవ్ శుక్లాల గురించి మీడియా ప్రశ్నించగా ఆయన సరిగా స్పందించలేదు.
శుభసూచికం: లక్ష్మణ్, సెహ్వాగ్
నూతన అధ్యక్షుడిగా ఎంపిక య్యే సౌరవ్ గంగూలీకి నాటి సహచ రులు వివిఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్ శుభాకాంక్షలు తెలిపారు. కంగ్రాట్స్ గంగూలీ... నీ నేతృత్వంలో భారత క్రికెట్ మరింత వృద్ధి చెందుతుందని నేను భావిస్తున్నా. కొత్త బాధ్యతలో మీరు అన్నీ విజయాలే సాధించాలి' అని లక్ష్మణ్ ట్వీట్ చేశాడు. ఇక మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం 'భారత క్రికెట్కు ఇది శుభసూచికం. ఇదివరకే టీమిండియాకు ఎనలేని సేవలు అందించిన దాదా కొత్త బాధ్యతల్లో మరింత ముందుకు సాగాలి' అని ఆకాంక్షించాడు.