Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రొ కబడ్డీ సెమీస్లో ఢిల్లీ, యు ముంబ చిత్తు
గుజరాత్: ప్రొ కబడ్డీ సీజన్-7 ఫైనల్లోకి తొలిసారి దబాంగ్ ఢిల్లీ, బెంగాల్ వారియర్స్ జట్లు ప్రవేశించాయి. బుధవారం జరిగిన సెమీఫైనల్ పోటీల్లో ఢిల్లీ 44-38 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్ను, బెంగాల్ 37-35తో యు ముంబను చిత్తుచేశాయి. హోరాహోరీగా సాగిన రెండో సెమీఫైనల్ పోటీలో ఇరుజట్లు చివరి పాయింట్ వరకు నువ్వా-నేనా అన్నట్లు పోటీపడ్డాయి. బెంగాల్ 36-35తో ఉన్న దశలో చివరి రైడ్కు వెళ్లిన యు ముంబ ఆటగాడు ఔట్ కావడంతో యు ముంబ జట్టు పరాజయం ఖాయమైంది. తొలి అర్ధభాగంలో ఇరుజట్లు రక్షణాత్మకంగా ఆడడంతో పాయింట్ల సాధనలో వెనుకబడ్డాయి. అంతేగాక తొలి అర్ధభాగం చివర్లో యు ముంబను ఆలౌట్ చేసి బెంగాల్ పట్టు బిగించసాగింది. బెంగాల్కు చెందిన సుకేష్(8), ఇస్మాయిల్(5) రాణించగా... ట్యాకిల్స్లో జీవకుమార్, రింకు నర్వాల్ మూడేసి పాయింట్లు గెలిచారు. యు ముంబ జట్టులో అభిషేక్ సింగ్(11) రైడ్లో రాణించగా... ఫజల్ అత్రాచెలి(1) ట్యాకిల్స్లో నిరాశపరిచాడు. ముంబ జట్టు 23 రైడ్ పాయింట్లను, 8 ట్యాకిల్ పాయింట్లను గెల్చుకోవడంతోపాటు రెండు ఆలౌట్ పాయింట్లు కూడా సాధించింది. ఇక బెంగాల్ జట్టు రైడ్లద్వారా 18, ట్యాకిల్స్లో 8 పాయింట్లను మాత్రమే సాధించగల్గింది. అంతకుముందు జరిగిన తొలి సెమీఫైనల్ పోటీలో ఢిల్లీ రైడర్ నవీన్కుమార్(15), చంద్రన్(9) సత్తా చాటారు. బుల్స్ జట్టులో పవన్కుమార్(18) ఒంటరి పోరాటం చేసినా... రోహిత్ కుమార్(5) నిరాశపరిచాడు. బెంగాల్ జట్టు 28 రైడ్ పాయింట్లను సాధించినా ట్యాకిల్స్లో 6 పాయింట్లను మాత్రమే గెల్చుకోగల్గింది. ఇక ఢిల్లీ జట్టు 23 రైడ్ పాయింట్లను, 15 ట్యాకిల్ పాయింట్లను సాధించినా 6 ఆలౌట్ పాయింట్లను గెల్చుకోగల్గింది. శనివారం జరిగే ప్రొ కబడ్డీ ఫైనల్లో దబాంగ్ ఢిల్లీతో బెంగళూరు బుల్స్ టైటిల్కై తలపడనుంది.