Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్ట్రేలియాపై 5-1తో గెలుపు
జోహోర్బహ్రు(మలేషియా): 9వ జోహోర్కప్ ఫైనల్లోకి భారత పురుషుల హాకీ జట్టు దూసుకెళ్లింది. లీగ్ పోటీలో భాగంగా బుధవారం ఆస్ట్రేలియాను 5-1 గోల్స్ తేడాతో చిత్తుచేసి రెండోస్థానంలో నిలిచింది. భారతజట్టు తరఫున లక్రా(26, 29వ ని.లో) రెండు గోల్స్ చేయగా... దిల్ప్రీత్సింగ్(44వ ని.), గుర్షహిజిత్ సింగ్(48వ ని.), మన్దీప్ మోర్(50వ ని.) గోల్ చేశారు. మ్యాచ్ ప్రారంభమైన తొలి నిమిషంలోనే ఆస్ట్రేలియా ఆటగాళ్ల తప్పిదంతో పెనాల్టీ లభించినా భారత ఆటగాళ్లు గోల్ చేయలేకపోయారు. తొలి అర్ధభాగానికే భారత్ 2-0 గోల్స్ ఆధిక్యతను సంపాదించింది. మూడో క్వార్టర్లో మరో రెండు గోల్స్ చేసి ఆస్ట్రేలియాపై తిరుగులేని 4-0 ఆధిక్యతలోకి తీసుకెళ్లారు. మ్యాచ్ ఆఖరి నిమిషాల్లో ఆస్ట్రేలియా, భారత్ ఒక్కో గోల్ చేయడంలో మ్యాచ్ 5-1తో ముగిసింది. శుక్రవారం జరిగే నామమాత్రపు, ఆఖరి లీగ్ మ్యాచ్లో అగ్రస్థానంలో ఉన్న బ్రిటన్తో తలపడనుంది. బ్రిటన్-భారత్ జట్ల మధ్య ఫైనల్ శనివారం జరగనుంది.