Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు: విజయ్ హజారే ట్రోఫీలో ముంబయి టీనేజర్ యశస్వి జైస్వాల్ రికార్డు పుటల్లోకెక్కాడు. దీంతో లిస్ట్-ఏ క్రికెట్లో 17ఏళ్లకే డబుల్ సెంచరీ చేసిన తొలి క్రికెటర్గా జైస్వాల్ నిలిచాడు. బుధవారం జార్ఖండ్తో వన్డే మ్యాచ్ సందర్భంగా యశస్వి 154 బంతుల్లో 12 సిక్సర్లు, 17 ఫోర్ల సాయంతో 203 పరుగులు చేసి ఈ ఫీట్ను నమోదు చేశాడు. ఈ మ్యాచ్లో తొలిగా బ్యాటింగ్కు దిగిన ముంబయి 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది.
అనంతరం జార్ఖండ్ జట్టు 46.4 ఓవర్లలో 319 పరుగులకే ఆలౌట్ కావడంతో ముంబయి 39 పరుగుల తేడాతో గెలిచింది. అంతకుముందు జైస్వాల్ కేరళపై 113, గోవాపై 122 పరుగులతో మెరిసిన సంగతి తెలిసిందే. అలాగే కేరళకు చెందిన సంజు శాంసన్ (212 నాటౌట్) గోవాపై డబుల్ సెంచరీ చేసి అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మన్గా నిలిచిన సంగతి తెలిసిందే.