Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ
ఓడెన్స్: డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ సైనా నెహ్వాల్ నిరాశపర్చింది. బుధవారం జరిగిన తొలిరౌండ్ పోటీలో జపాన్ షట్లర్ సయకా చేతిలో 15-21, 21-23 పాయింట్ల తేడాతో ఓడింది. తొలిగేమ్ను 15-21తో సునాయాసంగా ఓడిన సైనా రెండోగేమ్లో ప్రత్యర్ధికి చుక్కలు చూపించింది. ఓ దశలో 20-16తో ఆధిక్యతలో నిలిచినా ఒత్తిడికి లోనై ఆ గేమ్ను 21-23తో చేజార్చుకోవడం విశేషం. మిక్స్డ్ డబుల్స్లో ప్రణవ్ చోప్రా-సిక్కిరెడ్డి జోడీ 21-16, 21-11తో జర్మనీ జోడీని ఓడించగా... మహిళల డబుల్స్లో అశ్విని పొన్నప్ప-సిక్కిరెడ్డి జోడీ 23-25, 18-21తో పరాజయాన్ని చవిచూసింది.