Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డెన్మార్క్ ఓపెన్లో ముగిసిన భారత్ కథ
ఓడెన్సీ: డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్లో పివి సింధు కొరియాకు చెందిన 17 ఏళ్ల యువ షట్లర్ చేతిలో అనూహ్యంగా పరాజయాన్ని చవిచూసింది. గురువారం జరిగిన రెండోరౌండ్ పోటీలో సింధు 14-21, 17-21 పాయింట్ల తేడాతో అన్ చేతిలో ఓడింది. అన్సీడెడ్గా బరిలోకి దిగిన ఈ యువ షట్లర్ 5వ సీడ్పై గెలిచి రికార్డు నెలకొల్పింది. ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్ నెగ్గిన తర్వాత పివి సింధు ఆ తర్వాత జరిగిన టోర్నీలో సరైన ప్రదర్శన చేయలేకపోతోంది. రెండు సెట్లలోనూ సింధు కొరియా షట్లర్కు కనీస ప్రతిఘటన చూపకపోవడం గమనార్హం. ఇక పురుషుల సింగిల్స్లో సమీర్ వర్మ 12-21, 10-21 పాయింట్ల తేడాతో చెన్-లాంగ్(చైనా) చేతిలో చిత్తుగా ఓడాడు. మరో పోటీలో సాయి ప్రణీత్ 6-21, 14-21 పాయింట్ల తేడాతో టాప్సీడ్ కెంటో మొమొటో(జపాన్) చేతిలో వరుస సెట్లలో పరాజయాన్ని చవిచూశాడు. థారులాండ్ డబుల్స్ టైటిల్ విజేతలు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ 16-21, 15-21తో చైనాకు చెందిన 6వ సీడ్ జోడీ చేతిలో ఓడారు. మిక్స్డ్ డబుల్స్లో ప్రణవ్ చోప్రా-సిక్కిరెడ్డి జోడీ 24-26, 21-13, 11-21 పాయింట్ల తేడాతో మలేషియా జోడీ చేతిలో ఓడారు.