Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొంతకాలంగా విశ్రాంతి తీసుకుం టున్న టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని.. జట్టు సభ్యుల్ని కలిసే అవకాశం దొరికింది. రాంచీలో శనివారంనుంచి దక్షిణాఫ్రికాతో ఆరంభం కానున్న చివరి, మూడో టెస్టుకు ధోని వచ్చే అవకాశాలు ఉన్నాయి. తన సొంత మైదానంలో టెస్టు జరుగనున్న తరుణంలో ధోని హాజరు కావాలని నిర్ణ యించుకున్నాడట. దీనిపై అధికారికి సమాచారం లేకపోయినా ధోని మ్యాచ్ను వీక్షేందుకు వచ్చే అవకాశాలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి. జార్ఖండ్ మాజీ కెప్టెన్, ధోని చిన్ననాటి మిత్రుడు మహీర్ దివాకర్తో కలిసి మ్యాచ్కు ధోని రానున్నాడట. శనివారం ఉదయమే అక్కడికి చేరుకుంటాడని విశ్వసనీయ వర్గాల సమాచారం.