Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆఖరి లీగ్ మ్యాచ్ 3-3 గోల్స్తో డ్రా
- సుల్తాన్ జొహోర్ కప్
- నేడు ఫైనల్
జోహోర్బహ్రు(మలేషియా): సుల్తాన్ జోహోర్కప్లో భాగంగా గ్రేట్ బ్రిటన్తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్ను భారత్ డ్రాగా ముగించి ఊపిరి పీల్చుకుంది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్ను భారత్ 3-3 గోల్స్తో నిలువరించి ఊపిరి పీల్చుకుంది. తొలి క్వార్టర్లో ఇరుజట్లు గోల్స్ చేయడంలో విఫలమయ్యాయి. రెండోక్వార్టర్ 27వ నిమిషంలో బ్రిటన్ తరఫున గోల్ చేసి 1-0 ఆధిక్యతలోకి తీసుకెళ్లాడు. ఇక మూడో క్వార్టర్ ప్రారంభంలోనే (32వ ని.)లో గోల్ చేయడంతో బ్రిటన్ మరో గోల్ చేసి 2-0 ఆధిక్యతను సంపాదించింది. ఇక నిర్ణయాత్మక మూడో క్వార్టర్లో భారత ఆటగాళ్లు సమిష్టిగా రాణించారు. 48, 51, 57 నిమిషాల్లో షీలానంద్, మోర్, తివారిలు వరుసగా మూడు గోల్స్ చేసి 3-2 ఆధిక్యతలోకి దూసుకెళ్లారు. భారత్ గెలుపుకు చేరువగా ఉన్న దశలో మరో నిమిషంలో మ్యాచ్ ముగుస్తుందనగా బ్రిటన్ గోల్ చేయడంతో మ్యాచ్ 3-3 గోల్స్తో డ్రాగా ముగిసింది. 2013, 2014లో టైటిల్ విజేత అయిన భారత్ శనివారం జరిగే ఫైనల్లో బ్రిటన్తో తలపడనుంది. ఇక గ్రేట్ బ్రిటన్ డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగడంతోపాటు 2015లోనూ టైటిల్ను నెగ్గింది. నేడు జరిగిన ఇతర మ్యాచుల్లో మలేషియా 3-2తో జపాన్ను, న్యూజిలాండ్ 3-1తో ఆస్ట్రేలియాను ఓడించాయి. మలేషియా-జపాన్ జట్లమధ్య 3, 4 స్థానాలకు, న్యూజిలాండ్-ఆస్ట్రేలియాజట్లు 5-6 స్థానాలకు పోటీపడనున్నాయి.