Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్
కేప్టౌన్: దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ గులామ్ బోడికి ఐదేళ్ల జైలు శిక్ష పడింది. నాలుగేళ్ల క్రితం ఒక దేశవాళీ మ్యాచ్లో మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడని అభియోగాలు రుజువు కావడంతో అతనికి జైలుశిక్షను ఖరారు చేస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. 2015లో రామ్స్లామ్ టీ20 దేశవాళీ టోర్నీలో అల్వీరో పీటర్సన్ అనే క్రికెటర్కు ఫిక్సింగ్ చేయమని నగదు ఆశ చూపాడు. అతను ఈ విషయాన్ని బయటపెట్టడంతో బోడిపై విచారణ చేపట్టిన సఫారీ క్రికెట్ బోర్డు అతనిపై 20 ఏళ్ల నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దక్షిణాఫ్రికా తరఫున రెండు వన్డేలు ఆడిన బోడి.. రిటైర్మెంట్ అనంతరం కామెంటేటర్ అవతారం ఎత్తాడు. 2018 నవంబర్లో బోడి పోలీసులకు లొంగిపోయాడు. గతంలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ హాన్సీ క్రానే కూడా కేసు విచారణ దశలో ఉండగానే విమాన ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే.