Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజూ దృష్టికి నిఖత్ జరీన్ బాక్సింగ్ వివాదాన్ని తీసుకురావడంపై మేరీకోమ్ మండిపడ్డారు. 'అసలు ఆమె ఎవరు.. ఆమె గురించి నాకు అస్సలు తెలియదు' అంటూనే కాస్త ఘాటుగా స్పందించారు. 'ఈ వివాదాన్ని తెరపైకి తెవడంతో నేను షాక్ అయ్యా. నేను ఎనిమిది వరల్డ్ చాంపియన్స్ పతకాలు గెలిచా. అందులో ఆరు స్వర్ణ పతకాలు ఉన్నాయి. ఎవర్నీ పంపాలో బాక్సింగ్ ఫెడరేషన్ నిర్ణయిస్తుంది. అటువంటప్పుడు నీ ఏడుపు ఏమిటి. భారత బాక్సింగ్ జట్టులో చోటు కోసం లాబీయింగ్ చేయకు' అంటూ మేరీకోమ్ ఎదురుదాడికి దిగారు. అలాగే జరీన్కు మద్దతుగా నిలిచిన భారత షూటర్ అభినవ్ బింద్రాపై కూడా మేరీకోమ్ నోరు పారేసుకున్నారు 'నీ పని నువ్వు చూసుకో. బాక్సింగ్లో దూరకు. నీకు బాక్సింగ్ గురించి కానీ రూల్స్ కానీ తెలియదు. నేను ఏమైనా షూటింగ్ గురించి మాట్లాడానా. నీకు బాక్సింగ్ పాయింట్ల విధానం తెలుసా' అంటూ మండిపడ్డారు. దీనిపై విమర్శలు వస్తున్నాయి. మేరీకోమ్ ఎంతటి చాంపియన్ అయినా కానీ ఇలా మాట్లాడటం తగదంటున్నారు అభిమానులు. దేనికైనా హుందాగా సమాధానం చెబితే బాగుంటుందని హితవు పలుకుతున్నారు.