Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : భారత్ నుంచి మరో గ్రాండ్ మాస్టర్ హోదా లభించింది. స్విట్జర్లాండ్లో జరుగుతున్న చెస్ టోర్నమెంట్లో భారత్కు చెందిన రౌనక్ సాధ్వానీ గ్రాండ్ మాస్టర్ హోదాకు సాధించాల్సిన రేటింగ్ పాయింట్లు సొంతం చేసుకున్నాడు. దీంతో భారత్ నుంచి 65వ గ్రాండ్ మాస్టర్గా సాధ్వానీ నిలిచాడు. తొమ్మిది రౌండ్లుగా సాగిన ఈ టోర్నిలో సాధ్వానీ రెండు విజయాలు, ఆరు డ్రాలతో తన సత్తా చాటాడు. కేవలం ఒక్క రౌండ్లో, ఎనిమిదో రౌండ్లో మాత్రమే ఓటమి చెందాడు. అయితే చివరి రౌండ్లో రష్యాకు చెందిన గ్రాండ్ మాస్టర్ అలెగ్జాండర్ మత్వోలెవ్పై విజయం సాధించి గ్రాండ్ మాస్టర్ హోదాకు సాధించి వలసిన పాయింట్లు సొంతం చేసుకున్నాడు. ఇంతకీ సాధ్వానీ వయస్సు 13 ఏళ్ల, తొమ్మిది నెలల, 28 రోజుల మాత్రమే. దీంతో భారత్ నుంచి గ్రాండ్ మాస్టర్ హోదా సాదించిన నిహల్ సారిన్, ప్రజ్జానంధా, గుకేష్ తదితర టీనేజర్ల సరసన సాధ్వానీ నిలిచాడు.