Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆఫ్గాన్పై 5 వికెట్లతో గెలుపు
లక్నో: మూడు వన్డేల సిరీస్ను వెస్టిండీస్ జట్టు క్లీన్స్వీప్ చేసింది. సోమవారం జరిగిన మూడో, ఆఖరి వన్డేలో ఆఫ్ఘనిస్తాన్ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. తటస్థ వేదికపై టాస్ ఓడి తొలిగా బ్యాటింగ్కు దిగిన ఆఫ్గాన్ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. హజ్రతుల్లా జజారు(50), అస్గర్(86), మహ్మద్ నబి(50నాటౌట్) రాణించగా... కీమోపాల్కు మూడు, జోసెఫ్కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం విండీస్ ఓపెనర్ హోప్(109 నాటౌట్) సెంచరీతో కదం తొక్కడంతో 48.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ హోప్కు, సిరీస్ రోస్టన్ ఛేస్కు దక్కాయి. ఇరుజట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ నవంబర్ 14నుండి ప్రారంభం కానుంది.