Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దుబాయ్: లక్నో వేదికగా ఆఫ్గానిస్థాన్తో జరిగిన మూడో వన్డే మ్యాచ్లో బాల్ పరిస్థితిని మార్చేందుకు ప్రయత్నించిన విండీస్ బ్యాట్స్మెన్ నికోలస్ పూరన్పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) సస్పెన్షన్ విధించింది. ఒక టేప్తో బాల్పై రుద్దుతూ పూరన్ అడ్డంగా దొరికిపోయాడు. దీంతో అతనికి ఐదు డీమెరిట్ పాయింట్లతోపాటు నాలుగు మ్యాచ్ల నిషేధం విధించింది. ఆన్-ఫీల్డ్ అంపైర్లు బిష్మిల్లా షిన్వమరీ, అహ్మద్ దుర్రానీ, మూడో అంపైర్ అహ్మద్ పాఖ్టీన్, ఫోర్త్ అంపైర్ ఇజాతుల్లా సఫీ.. పూరన్కు ఛార్జీలు విధించారు. మ్యాచ్ రెఫరీ క్రిస్ బోర్డ్ వద్ద పూరన్ తాను నేరం చేసినట్లు అంగీకరించాడు. దీంతో అతను ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్లోని ఆర్టికల్ 2.1.4లో నిబంధనలు మూడు రేట్లుగా ఉల్లంఘించిన కారణంగా అతనికి నాలుగు సస్పెన్షన్ పాయింట్లు విధించారు. అయితే ఇందుకు కనిష్ఠంగా నాలుగు డీమెరిట్ పాయింట్లు విధిస్తారు. కానీ పూరన్ చేసిన తప్పుకు అతనికి ఐదు డీమెరిట్ పాయింట్లు విధించారు. అంటే అతనిపై రెండు టెస్ట్లు లేదా నాలుగు వన్డే, టీ-20ల నుంచి నిషేధం ఉంటుంది.