Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : న్యూజిలాండ్ స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ వచ్చే ఐపిఎల్ సీజన్లో ముంబయి ఇండియన్స్ తరుపున ఆడనున్నాడు. ఈ విషయాన్ని ముంబయి ఇండియన్స్ తన అధికారిక ట్విటర్ ద్వారా బుధవారం వెల్లడించింది. ఈ మేరకు ఢిల్లీ క్యాపిటల్స్తో ముంబయి ఇండియన్స్ ట్రేడింగ్ విండో ద్వారా ఒప్పందం చేసుకుంది. మరోవైపు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడు అంకిత్ రాజ్పుత్ ఆటగాళ్ల మార్పులో భాగంగా రాజస్తాన్ రాయల్స్కు బదిలీ అయ్యాడు. ఐపిఎల్-2020 సీజన్కు సంబంధించి ట్రేడింగ్ విండో గడువు గురువారం (నవంబర్-14)తో ముగుస్తుండటంతో ఆటగాళ్ల మార్పులు ఇంకా చోటు చేసుకునే అవకాశం ఉంది. ట్రేడింగ్ ముగిసిన అనంతరం ఐపిఎల్ వేలం డిసెంబర్19న కోల్కతాలో జరగనుంది.