Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటినుంచి భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి టెస్ట్
- ఉదయం 9.30 గం||ల నుంచి
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో భాగంగా దక్షిణాఫ్రికాపై క్లీన్స్వీప్ చేసిన టీమిండియా.. పసికూన బంగ్లాదేశ్తో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ను కూడా వైట్వాష్ చేసి చాంపియన్ షిప్లో ఎవరికీ అందని ఎత్తులో నిలవాలని కోహ్లీ సేన భావిస్తోంది. కాగా, 2000లో టెస్టు హోదా పొంది భారత్తోనే ఢాకాలో తొలి టెస్టు ఆడిన బంగ్లాదేశ్ ఇప్పటివరకు భారత్పై ఒక టెస్ట్ మ్యాచ్నూ గెలవలేకపోయింది.
భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య
9 టెస్టులు జరగ్గా... 7 టెస్టుల్లో భారత్ నెగ్గి, మరో రెండు టెస్ట్ మ్యాచ్లను 'డ్రా'గా ముగించింది.
ఇండోర్: టెస్ట్ ఛాంపియన్షిప్లో కోహ్లీసేన దూసుకెళ్తోంది. వన్డే ప్రపంచకప్ టోర్నీ ముగిసిన అనంతరం ఆరంభమైన టెస్ట్ ఛాంపియన్షిప్లో టీమిండియా సిరీస్ ఓటమిని చవిచూడలేదు. దీంతో మిగతా జట్లన్నింటినీ వెనక్కి నెట్టి కోహ్లీసేన అగ్రస్థానంలో నిలిచింది. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన కోహ్లీ బృందం మరో సిరీస్పై గురిపెట్టింది. బంగ్లాదేశ్తో రెండు టెస్టుల సిరీస్లో భాగంగా గురువారం ఇండోర్ వేదికగా మొదలయ్యే తొలి టెస్టు కోసం టీమిండియా సన్నద్ధమైంది. ఇటీవల జరిగిన టీ20 సిరీస్ను తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా 2-1తో చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే.
దక్షిణాఫ్రికాతో టెస్ట్లో ఫామ్లో ఉన్న పేసర్లు షమీ, ఇషాంత్, ఉమేశ్ యాదవ్లతోపాటు అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్లాంటి మేటి స్పిన్నర్లను బంగ్లాదేశ్ ఏమేరకు ఎదుర్కొంటుందో వేచి చూడాలి. 2000లో టెస్టు హోదా పొంది భారత్తోనే ఢాకాలో తొలి టెస్టు ఆడిన బంగ్లాదేశ్ ఇప్పటివరకు భారత్పై మాత్రం ఓ టెస్ట్ కూడా గెలవలేకపోయింది. గత 19 ఏళ్లలో భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య 9 టెస్టులు జరిగాయి. 7 టెస్టుల్లో భారత్ నెగ్గగా... రెండు టెస్టులు 'డ్రా' అయ్యాయి. భారత్తో భారత్లో టెస్టు ఆడేందుకు మాత్రం బంగ్లాదేశ్కు 17 ఏళ్లు వేచి చూడాల్సి వచ్చింది. తొలిసారి 2017 ఫిబ్రవరిలో హైదరాబాద్ వేదికగా టీమిండియాతో బంగ్లాదేశ్ టెస్టు ఆడింది. ఆ మ్యాచ్లో భారత్ 208 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. నిషేధం కారణంగా స్టార్ ఆల్రౌండర్ షకీబ్... వ్యక్తిగత కారణాలతో తమీమ్... గాయం కారణంగా మష్రఫె ముర్తజాలాంటి మేటి ఆటగాళ్ల సేవలు బంగ్లాదేశ్ కోల్పోయిన నేపథ్యంలో టెస్టు సిరీస్లో బంగ్లాదేశ్ ఎలా నెట్టుకొస్తుందో చూడాలి. ఓవరాల్గా బంగ్లాదేశ్ గత 19 ఏళ్లలో మొత్తం 115 టెస్టులు ఆడింది. ఇందులో 13 మ్యాచ్ల్లో గెలిచిన ఆ జట్టు ఏకంగా 86 మ్యాచ్ల్లో ఓటమి చవిచూసింది. 16 మ్యాచ్లను 'డ్రా' చేసుకోగల్గింది.
ధోని రికార్డుపై సాహా కన్ను...
టీమిండియా టెస్టు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా సీనియర్ వికెట్ కీపర్ ఎంఎస్ ధోని రికార్డుపై కన్నేశాడు. బంగ్లాదేశ్తో జరగబోయే రెండు టెస్టుల సిరీస్లో సాహాను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. బంగ్లాదేశ్-భారత్ల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ల్లో అత్యధిక ఔట్లు చేసిన కీపర్గా ధోనీ(15) రికార్డు సాధించాడు. అందులో 12 క్యాచ్లు, మూడు స్టంపౌట్లు ఉన్నాయి.
ఆ తర్వాతి స్థానంలో 12 ఔట్లతో దినేశ్ కార్తీక్ నిలిచాడు. ఇందులో 11 క్యాచ్లు 1 స్టంపౌట్ ఉన్నాయి. సాహా ఇప్పటివరకూ బంగ్లాతో ఆడిన రెండు టెస్టుల్లో ఏడు ఔట్లు చేశాడు. అయితే ఈ రెండు టెస్ట్లలో అతను మరో ఎనిమిది ఔట్లను తన ఖాతాలో వేసుకుంటే ధోనీ రికార్డును అధిగమించే అవకాశం ఉంది. లేకుంటే కనీసం ఐదు వికెట్లను సాధించిన కార్తీక్ సరసన నిలుస్తాడు.
భారతజట్టు(అంచనా): విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్/ శుభ్మన్ గిల్, ఛటేశ్వర పుజరా, అజింక్య రహానె,/హనుమ విహారి, వృద్ధిమాన్ సాహా/రిషబ్ పంత్(వికెట్ కీపర్లు), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఉమేష్ యాదవ్/ఇషాంత్ శర్మ, మహ్మద్ షమి, కుల్దీప్ యాదవ్.
బంగ్లాదేశ్ జట్టు(అంచనా): మోమినుల్ హక్(కెప్టెన్), షాద్మన్ ఇస్లామ్, ఇమ్రుల్ కయాస్, లింటన్ దాస్, ముష్ఫికర్ రహీమ్(వికెట్ కీపర్), మహ్మదుల్లా, ముసద్దెక్ హొసైన్, మెహదీ హసన్/తైజుల్ ఇస్లామ్, ముస్తఫిజుర్ రెహ్మాన్, నయీమ్ హసన్/సైఫ్ హసన్, మహ్మద్ మిథున్.