Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరేబియన్ అమ్మాయిలపై
- ఏడు వికెట్లతో గెలుపు
గయానా: భారత మహిళల క్రికెట్ జట్టు కరేబియన్లపై ఐదు టీ20ల సిరీస్ను మరో రెండు మ్యాచులు మిగిలుండగానే 3-0తో చేజిక్కించుకున్నారు. గురువారం జరిగిన మూడో టీ20లో వెస్టిండీస్పై ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. తొలిగా బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ జట్టు భారత బౌలర్ల దెబ్బకు 59 పరుగులకే పరిమితమయ్యారు. రాధా, దీప్తిలకు రెండేసి, అనూజ, పూజ, హర్మన్, పూనమ్లకు తలా ఒక వికెట్ పడగొట్టారు. చెడీన్ నేషన్(11), హెన్రీ(11) టాప్ స్కోరర్లు. అనంతరం 60 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకు శుభారంభం దక్కలేదు. గత టీ20లో అదరగొట్టిన ఓపెనర్ షెఫాలీ వర్మ(0) డకౌటై నిరాశపరిచింది. ఆ తర్వాత మంధాన(3), హర్మన్ ప్రీత్కౌర్(7) స్వల్ప స్కోర్లకే పెవీలియన్కు చేరిపోయారు. ఈ దశలో జెమీమా రోడ్రిగ్స్(40 నాటౌట్), దీప్తి(7 నాటౌట్) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి 16.4 ఓవర్లలో భారత్కు విజయాన్ని సంపాదించిపెట్టారు. ఉమెన్ ఆఫ్ ది మ్యాచ్ రోడ్రిగ్స్కు దక్కగా... నాల్గో టీ20 ఆదివారం జరగనుంది.