Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాంకాంగ్ ఓపెన్లో ముగిసిన భారత్ కథ
హాంకాంగ్: హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ సెమీఫైనల్లో భారత షట్లర్ కిదాంబి శ్రీకాంత్ ఓటమిపాలయ్యాడు. శనివారం జరిగిన సెమీస్ పోటీలో శ్రీకాంత్ 9-21, 23-25తో స్థానిక ఆటగాడు లీ-ఛెక్-యు చేతిలో వరుస సెట్లలో ఓడాడు. తొలిసెట్ను కనీస ప్రతిఘటన చూపకుండానే ప్రత్యర్ధికి కోల్పోయిన శ్రీకాంత్ రెండో సెట్లో అనూహ్యంగా పుంజుకున్నాడు. ఓ దశలో 20-19తో సెట్ పాయింట్కు దగ్గల్లో నిలిచినా... ఆ తర్వాత హాంకాంగ్ షట్లర్ మెరుగైన ప్రదర్శన చేయడంతో ఆ సెట్ను 23-25తో చేజార్చుకున్నాడు. ఇరువురు షట్లర్ల మధ్య సాగిన ఈ పోరు 42 నిమిషాలసేపు నడిచింది. ఈ టోర్నీలో సెమీస్ వరకు చేరిన ఏకైక షట్లర్ కిదాంబి నేడు ఓటమిపాలవ్వడంతో భారత్ కథ ముగిసినట్లైంది. మరో సెమీస్ పోటీలో గింటింగ్(ఇండోనేషియా) 22-20, 13-21, 21-19తో తన దేశానికే చెందిన జొనాథన్ క్రిస్టీపై గెలిచి టైటిల్కై లీతో తలపడనున్నాడు. ఇక మహిళల సింగిల్స్ ఫైనల్ చెన్-యుఫీ(చైనా), ఇంటనాన్(థారులాండ్)ల మధ్య జరగనుంది. సెమీస్లో చెన్-యుఫీ 21-18, 14-21, 21-15తో బీవెన్ జంగ్(అమెరికా)ను చిత్తుచేయగా... మరో మ్యాచ్లో ఇంటనాన్ 21-23, 21-15, 21-12తో 2వ సీడ్ యమగుచి(జపాన్)పై గెలిచి ఫైనల్లోకి ప్రవేశించింది.