Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసోంపై ముంబయి గెలుపు
ముంబయి: నిషేధిత ఉత్ప్రేరకం వాడి నిషేధానికి గురై.. క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చిన ముంబయి ఓపెనర్ పథ్వీ షా బ్యాటింగ్లో అదరగొట్టాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ-20 టోర్నీలో భాగంగా ఆదివారం అసోంతో జరిగిన మ్యాచ్లో పథ్వీ షా మెరుపులు మెరిపించాడు. అసోం బౌలర్లపై విరుచుకుపడి 39 బంతుల్లోనే 63 పరుగులు చేసాడు. మరో ఓపెనర్ ఆదిత్యా తారే 82 పరుగులతో రాణించడంతో.. ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 206 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో అసోం 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 123 పరుగులే చేసింది. దీంతో ముంబై 83 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. నిషేధకాలం ముగిసిన అనంతరం పునరాగమనం చేసిన తొలి మ్యాచ్లోనే విజంభించిన పథ్వీ షాకు బీసీసీఐ స్వాగతం పలికింది. షా అర్ధ శతకం సెలబ్రేషన్స్ను ట్విటర్లో పోస్ట్ చేసింది.
గత మార్చిలో ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడిన షా.. జలుబు చేయడంతో దగ్గు మందు వాడాడు. అందులో 'వాడా' బహిస్కత డ్రగ్ 'టర్బులిన్' ఉంది. బోర్డు అనుమతి లేకుండా ఈ డ్రగ్ తీసుకోవడంతో.. 8 నెలల సస్పెన్షన్కు గురైన సంగతి తెలిసిందే. గత వారంలో పుట్టినరోజు జరుపుకున్న షా పునరాగమనం తర్వాత చెలరేగుతాననీ, ఇకపై మీరు పథ్వీషా 2.0ని చూస్తారని ఓ ట్వీట్లో పేర్కొన్నాడు. అందుకు తగ్గట్టుగానే సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్లో ఆడిన తొలి మ్యాచ్లోనే పృథ్వీషా విజృంభించాడు.