Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విరుద్ధ ప్రయోజన ఫిర్యాదు కొట్టివేత
న్యూఢిల్లీ: భారత క్రికెట్ టీమ్ మాజీ సారథి, బీసీసీఐ (భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి క్లీన్చిట్ లభించింది. గంగూలీ పరస్పర విరుద్ధ ప్రయోజనాలు కలిగి ఉన్నారని మధ్యప్రదేశ్ క్రికెట్ అసోషియేషన్ శాశ్వత సభ్యుడు సంజీవ్ గుప్తా.. బీసీసీఐకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. బెంగాల్ క్రికెట్ అసోషియేషన్ (క్యాబ్) అధ్యక్షుడిగానే కాకుండా బీసీసీఐ ఏజీఎమ్లో బెంగాల్ నుంచి ప్రతినిధిగా ఉన్నారని ఫిర్యాదులో ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టిన ఎథిక్స్ ఆఫీసర్ డీకే జైన్ దాదాకు ఎలాంటి విరుద్ధ ప్రయోజనాలూ లేవని స్పష్టం చేశారు. బీసీసీఐ అధ్యక్ష పదవి చేపట్టకముందే క్యాబ్ అధ్యక్షుడి బాధ్యతల నుంచి తప్పుకున్నారని తెలిపారు. '2019 అక్టోబర్ 23న బీసీసీఐ అధ్యక్ష పదవి చేపట్టనున్న నేపథ్యంలో క్యాబ్ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని క్యాబ్ కార్యదర్శి అభిషేక్ దాల్మియాకు దాదా రాజీనామా లేఖను సమర్పించారు. దీంతో పరస్పర విరుద్ధ ప్రయోజనాలు ఇందులో లేవు' అని జైన్ వెల్లడించారు.
బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం ఒకే సమయంలో ఏ వ్యక్తీ ఒకటి కంటే ఎక్కువ హౌదాల్లో పని చేయడానికి వీల్లేదు. ఈ క్రమంలోనే ఈ విరుద్ధ ప్రయోజనాల అంశం గత కొంతకాలంగా భారత క్రికెట్ను కుదిపేస్తున్నది. ఇప్పటికే దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, వివిఎస్. లక్ష్మణ్, కపిల్ దేవ్ తదితరులు నోటీసులు ఎదుర్కొన్నారు. ఇటీవలే రాహుల్ ద్రవిడ్పై విరుద్ధ ప్రయోజనాల ఫిర్యాదుని బీసీసీఐ కొట్టివేసింది.