Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వచ్చేనెలలో మూడు వన్డే, టీ-20 క్రికెట్ మ్యాచ్లు
న్యూఢిల్లీ: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరగనున్న క్రికెట్ సిరీస్ షెడ్యూల్ను బీసీసీఐ ఆదివారం విడుదల చేసింది. డిసెంబర్ 6న మొదలుకానున్న ఈ సిరీస్లో రెండు జట్లు 3 టీ-20లు, 3 వన్డే మ్యాచ్లు ఆడనున్నాయి. డిసెంబర్ 6న వాంఖడే వేదికగా మొదటి టీ-20, 8న తిరువనంతపురంలో రెండో టీ-20 జరగనుండగా.. ఆఖరు టీ-20 మ్యాచ్ 11న హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషన్ క్రికెట్ స్టేడియంలో నిర్వహించనున్నారు. అలాగే భారత్, విండీస్ల మధ్య తొలి వన్డే డిసెంబర్ 15న చెన్నైలో, రెండో వన్డేను 18న విశాఖపట్నంలో నిర్వహించనున్నారు. ఇక మూడో వన్డే మ్యాచ్ 22న కటక్లో జరగనున్నది.