Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హౌబర్ట్ ఇంటర్నేషనల్తో రీ ఎంట్రీ
ముంబయి : మాతృత్వ సెలవులో రెండేండ్లు గడిపిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తిరిగి రాకెట్ పట్టుకునేందుకు సిద్ధమైంది. ఆరు నెలల ముందే అంతర్జాతీయ పునరాగమం చేద్దామనుకున్న సానియాకు చికెన్ గున్యా రూపంలో అవాంతరం ఎదురైంది. ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించిన సానియా 2020 జనవరిలో హౌబర్ట్ ఇంటర్నేషనల్ టోర్నీలో రాకెట్ పట్టనుంది. ' నేను హౌబర్ట్ ఇంటర్నేషన్లో ఆడుతున్నాను. ఆస్ట్రేలియా ఓపెన్లోనూ ఆడతాను. ముంబయిలో ఓ టోర్నీ ఆడేందుకు సన్నద్ధం అవుతున్నాను. కానీ అవకాశాలు 50-50. కానీ హౌబర్ట్లో ఆడటం మాత్రం పక్కా. ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. చికెన్ గున్యా కారణంగా ప్రణాళికలు తారుమారు అయ్యాయి. భారత్కు మూడు సార్లు ఒలింపిక్స్లో ప్రాతినిథ్యం వహించాను. రియోలో తృటిలో పతకం కోల్పోయాం. మరోసారి ఒలింపిక్స్లో ఆడే అవకాశం దక్కితే గొప్ప గౌరవంగా భావిస్తాను' అని సానియా మీర్జా తెలిపింది. వరల్డ్ నం.38, ఉక్రెయిన్ క్రీడాకారిణి నదియా కిచనోక్తో సానియా మీర్జా మహిళల డబుల్స్లో జట్టు కట్టనుంది.