Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభిమన్యు మిథున్ మెరుపులు
సూరత్ : కర్నాటక ప్రీమియర్ లీగ్ (కెపీఎల్) మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో పోలీసుల నుంచి నోటీసు అందుకుని ఒత్తిడిలో ఉన్న భారత మాజీ పేసర్ అభిమన్యు మిథున్ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. హర్యానాతో ముస్తాక్ అలీ టీ20 టోర్నీ సెమీఫైనల్లో అభిమన్యు 5/39తో రెచ్చిపోయాడు. ఆఖరు ఓవర్లో ఐదు వికెట్లు కూల్చిన అభిమన్యు కర్నాటక లక్ష్యాన్ని 200 లోపు ఉండేలా చూశాడు. తొలి మూడు ఓవర్లలో 37 పరుగులు ఇచ్చుకున్న అభిమన్యు మిథున్.. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో హ్యాట్రిక్ వికెట్లు సహా ఐదు వికెట్లు కూల్చాడు. తొలుత బ్యాటింగ్ చేసిన హర్యానా 194/8 పరుగులు చేసింది. హిమాన్షు రానా (61), బిష్ణోరు (55) రాణించారు. ఛేదనలో కెఎల్ రాహుల్ (66), పడికాల్ (87) మెరవటంతో కర్నాటక 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 15 ఓవర్లలోనే కర్నాటక 195 పరుగులు చేసింది. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ ఫైనల్లోకి ప్రవేశించింది.