Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు బీసీసీఐ ఏజీఎం సమావేశం
ముంబయి : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నేడు కీలక సర్వ సభ్య సమావేశానికి సిద్ధమైంది. మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా పగ్గాలు అందుకున్న తర్వాత బోర్డు తొలిసారి ఏజీఎం నిర్వహించనుంది. ఆదివారం నాటి సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. గత మూడేండ్ల అకౌంట్లను ఏజీఎం నేడు ఆమోదించనుంది. పరిపాలన సంబంధిత విషయాల కంటే జస్టిస్ లోధా కమిటీ సంస్కరణలపైనే బీసీసీఐ ఏజీఎం ప్రధానంగా చర్చించనుంది. నిబంధనల ప్రకారం రెండు పర్యాయాలు పదవి చేపట్టిన తర్వాత విరామ సమయంలో ఉండాలి. గంగూలీ విరామ సమయానికి తొమ్మిది నెలల దూరంలో ఉన్నాడు. గంగూలీ కోసం ఈ నిబంధనలో మార్పు చేయాలని ఏజీఎం తీర్మానించనుంది. అందుకు రాజ్యాంగ సవరణ అవసరం. రాజ్యాంగ సవరణ ఇప్పుడు సుప్రీంకోర్టు అనుమతితో మాత్రమే చేయాల్సి ఉంది. క్రికెట్ సలహా సంఘం (సీఏసీ) సభ్యులుగా సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్లను తిరిగి నియమించే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో నాలుగేండ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్న సీనియర్ సెలక్షన్ కమిటీ స్థానంలో కొత్త కమిటీని నేడు ఏజీఎంలో నియమించే అవకాశం మెండుగా కనిపిస్తోంది. నూతన అంబుడ్స్మన్, ఎథిక్స్ ఆఫీసర్ నియామకాన్ని సైతం ఏజీఎం చేపట్టనుంది.