Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఖాట్మాండు : 13వ దక్షిణాసియా గేమ్స్ ఆదివారం ఘనంగా ప్రారంభయమ్యాయి. ఈ గేమ్స్కు నేపాల్ రాజధాని ఖట్మాండు ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం పదిరోజుల పాటు ఈ క్రీడలు జరగనున్నాయి. ఆదివారం ఇక్కడి దశరథ్ స్టేడియంలో గేమ్స్ ప్రారంభం వేడుకలను ఘనంగా నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పాల్గొనే జట్లు మార్చ్ ఫాస్ట్ నిర్వహించాయి. 75 మందితో కూడిన భారత బృందానికి షాట్పుటర్ తేజిందర్పాల్ సింగ్, 1500 మీటర్ల రేసర్ పీయూ చిత్ర నేతృత్వం వహించారు. ఈ పోటీల్లో ఆతిథ్య నేపాల్, భారత్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, పాకిస్థాన్, శ్రీలంక దేశాల అథ్లెట్లు పాల్గొంటున్నారు. ఈ టోర్నిలో మొత్తంగా 28 అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. భారత్ 17 క్రీడాంశాల్లో మాత్రమే పోటీపడుతోంది. భారత పురుషుల వాలీబాల్ జట్టు ఫైనల్కు చేరుకుంది. ఆదివారం సెమీ ఫైనల్లో శ్రీలంకపై భారత్ 27-25, 25-19, 21-25, 25-21 స్కోరుతో శ్రీలంకపై విజయం సాధించింది. ఫైనల్లో పాకిస్తాన్తో భారత్ తలపడనుంది. ఆదివారం మరోక సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్పై 25-15, 25-21, 26-24 స్కోరుతో పాకిస్తాన్ విజయం సాధించింది.