Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జట్టును ప్రకటించిన సెలక్షన్ కమిటీ
ముంబయి : హైదరాబాద్ యువ క్రికెటర్ తిలక్ వర్మ అండర్-19 ప్రపంచకప్ జట్టుకు ఎంపికయ్యాడు. 16 ఏండ్లకే హైదరాబాద్ తరఫున రంజీ అరంగ్రేటం చేసిన తిలక్ వర్మ, ఈ సీజన్లో సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో అరంగ్రేటం చేశాడు. స్టైయిష్ బ్యాట్స్మన్ తిలక్ వర్మ ఓపెనర్గా ఇప్పటికే సెంచరీల మోత మోగించాడు. దక్షిణాఫ్రికాలో 2020 అండర్-19 ప్రపంచకప్ జరుగనుంది. 16 జట్లు పాల్గొంటున్న టోర్నీల్లో నాలుగు సార్లు చాంపియన్ భారత్ గ్రూప్-ఏలో జపాన్, న్యూజిలాండ్, శ్రీలంకలతో పోటీపడనుంది. ప్రతి గ్రూప్ నుంచి రెండు జట్లు సూపర్ లీగ్కు అర్హత సాధిస్తాయి. అంతకముందు దక్షిణాఫ్రికా-19తో భారత్ మూడు వన్డేలు ఆడనుంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, న్యూజిలాండ్లతో నాలుగు దేశాల టోర్నీలో తలపడనుంది. హైదరాబాద్ యువ సీమర్ సిటిఎల్ రక్షణ్ ద్వైపాక్షిక సిరీస్ జట్టుకు ఎంపికయ్యాడు. అండర్-19 ప్రపంచకప్కు భారత జట్టును జూనియర్ సెలక్షన్ కమిటీ సోమవారం ప్రకటించింది.
భారత అండర్-19 వరల్డ్కప్ జట్టు : యశస్వీ జైశ్వాల్, తిలక్ వర్మ, దివ్యాన్షు సక్సేనా, ప్రియాం గార్గ్, ధ్రువ్ చాంద్, శస్వంత్ రావత్, శుభాంగ్ హెగ్డే, రవి బిష్ణోరు, అకాశ్ సింగ్, కార్తీక్ త్యాగి, అతర్వ, కుమార్ కుశాగ్ర, సుశాంత్ మిశ్రా, విద్యాధర్ పాటిల్.